తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించారు. కార్తీక మాసం మరియు అయ్యప్ప సీజన్ కావడంతో ఆయన నిష్టగా దీక్షను పాటిస్తున్నారు. తాజాగా ఆయన తన నివాసంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంప్రదాయ వస్త్రధారణలో, మెడలో మాలలతో స్వామివారిని అర్చిస్తున్న సీఎం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేసినట్లు సన్నిహితులు తెలిపారు.