తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ నియామక ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, డీజీపీల ఎంపిక కోసం ఒక ప్యానెల్ లిస్టును తయారు చేసి, రెండు వారాల్లోగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిబంధనల ప్రకారం ప్యానెల్ లిస్టు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ లిస్టును UPSCకి పంపిన తర్వాతే కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.