ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఆదిలాబాద్, లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. హైదరాబాద్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.