తాజా వార్తలు అంతర్జాతీయం జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తి వీడియోలు ఆరోగ్యం క్రీడలు సినిమా క్రైమ్ వార్తలు బిజినెస్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాటున డ్రగ్స్ దందా.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేడీ టెక్కీ అరెస్ట్!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మాటున డ్రగ్స్ దందా.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేడీ టెక్కీ అరెస్ట్!

January 22, 2026

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న సుష్మిత అనే యువతి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు బుధవారం ఉదయం వారి నివాసంపై దాడి చేసి సుష్మితను అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న

భార్యను హత్య చేసిన భర్త.. జల్సాలకు బానిసై ఘాతుకం!

భార్యను హత్య చేసిన భర్త.. జల్సాలకు బానిసై ఘాతుకం!

January 22, 2026

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడ్డ భర్త రాజును, తన తీరు మార్చుకోవాలని భార్య మందలించడమే ఆమె పాలిట శాపంగా మారింది. నిన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, విసిగిపోయిన భార్య తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది. మార్గమధ్యలో ఆమెను అడ్డగించిన భర్త, విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితుడు

డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే ఇక అంతే.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే ఇక అంతే.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

January 22, 2026

న్యూ ఇయర్ జోష్‌లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేదే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 100 చోట్ల చెక్ పోస్టులు, 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, మరియు 6 నెలల జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!

గుండె తరుక్కుపోయే విషాదం: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!

January 22, 2026

అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.

భారత్‌తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట

భారత్‌తో గొడవలు వద్దు.. స్నేహమే ముద్దు: బంగ్లాదేశ్ కొత్త బాట

January 22, 2026

భారత్‌తో గొడవలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుచుకోవాలనేదే తమ ఉద్దేశమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం