హయత్నగర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి (NH65) పై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం, పాదచారులు రోడ్డు దాటలేక ప్రాణాలు కోల్పోతుండటంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు.
గత కొన్ని రోజులుగా కాలనీ వాసులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) సౌకర్యం కూడా లేకపోవడంతో జనం మండిపడ్డారు. బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్ చేస్తూ హైవేపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి