నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు వేగవంతం అయ్యాయి. పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన డెడ్లైన్ లోపు మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ కృషి చేస్తోంది.