కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వచ్చే వారం జరగనున్న వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఈవో తెలిపారు.